![సీఎం కేసీఆర్కీలక నిర్ణయం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/11/CM-KCR2.jpg?fit=677%2C406&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీమంత్రి బస్వరాజు సారయ్య. కళాకారుడు గోరటి వెంకన్న, దయానంద్ గుప్తాకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. గవర్నర్ కోటాలో ఆ ముగ్గురు పేర్లను శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో వెల్లడించారు. త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీకానున్న నేపథ్యంలో ఈ ముగ్గురు పేర్లు ఎంపిక చేశారు. దివంగత మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీకాలం ముగియనుండడంతో పై ముగ్గురికి అవకాశం కల్పించారు.