![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/MLA-RAVISHANKARFF.jpg?fit=700%2C329&ssl=1)
సారథిన్యూస్, రామడుగు/ బోయినపల్లి: ముఖ్యమంత్రి సహాయనిధి పేదప్రజలకు ఎంతో అండగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 8లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యాక్రమంలో బాధితులు, ఆయాగ్రామాల సర్పంచుల్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.