Breaking News

శ్రీశైలం వెళ్తున్న రేవంత్​రెడ్డి అరెస్ట్​

ఎంపీ రేవంత్​రెడ్డి అరెస్ట్​

సారథి న్యూస్​, అచ్చంపేట: తెలంగాణ పరిధిలోని శ్రీశైలం పాతాళగంగ జెన్​కో పవర్​హౌస్​లో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ప్రమాదస్థలిని పరిశీలించేందుకు వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డిని నల్లగొండ జిల్లా డిండి వద్ద పోలీసులు పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పునుంతల పోలీస్​స్టేషన్​కు తరలించారు. సంఘటన జరిగిన తీరును తెలుసుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని, విచారణకు ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని తనను అడ్డుకున్న పోలీసులతో ఎంపీ రేవంత్​రెడ్డి వాదనకు దిగారు. అలాగే నాగర్​కర్నూల్​ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను పోలీసులు కల్వకుర్తిలోనే హౌస్​ అరెస్ట్​చేసి ఉంచారు.

పోలీస్​స్టేషన్​ ఎదుట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్​ కార్యకర్తలు నాయకులు