Breaking News

శ్రీరామ ‘రక్ష’

సారథి న్యూస్, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సోమవారం ఇంంటింటా వేడుకగా జరిగింది. అక్కాచెల్లెళ్లు.. తమ తమ్ముళ్లు, అన్నలకు రాఖీలు కట్టి దీవించారు. హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​కు ఆయన సోదరి రాఖీ కట్టారు. తన సోదరి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ​ఎంపీ మలోత్​ కవిత, ప్రభుత్వ విప్ గొంగడి సునిత, టీఆర్ఎస్ నాయకురాలు గుండు సుధారాణి తదితరులు కలిసి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావును ప్రగతిభవన్​లో కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపీ కవిత సోదరుడు కేటీఆర్​కు రాఖీ కట్టారు. అనంతరం వారికి కేటీఆర్​దంపతులు సారెచీరెలు పెట్టి పంపించారు. అలాగే మహబూబ్​నగర్​జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యేకు ఆయన సోదరి రాఖీ దీవెనలు అందించారు.