Breaking News

శ్రీనగర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు హతం

శ్రీనగర్​: జమ్ముకశ్మీర్​లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. స్థానికుల అండదండలతో చెలరేగిపోతున్నాయి. తాజాగా శ్రీనగర్​లోని పంతాచౌక్​ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సీఆర్​పీఎఫ్​ దళాలపై ఉగ్రమూక ఒక్కసారిగా దాడులకు తెగబడింది. వెంటనే అలర్టయిన జవాన్లు ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. మరోవైపు సీఆర్​పీఎఫ్​కు చెందిన ఓ అసిస్టెంట్​ సబ్​ఇన్​స్పెక్టర్​ కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటనతో శ్రీనగర్​ అట్టుడుకింది. ఇరు వర్గాలు దాదాపు గంటపాటు ఫైరింగ్​ చేసుకున్నట్టు సమాచారం.