Breaking News

శిఖర్ ​ధనాధన్.. ఢిల్లీ విన్​

శిఖర్​ధనాధన్.. ఢిల్లీ విన్​


దుబాయ్‌: ఐపీఎల్​13 సీరిస్​లో భాగంగా 30వ మ్యాచ్​.. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 13 పరుగుల తేడాతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో విజయం సాధించింది. ముందు టాస్ ​గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ చివరి నాలుగు ఓవర్లలో మాత్రం కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాట్స్​మెన్లలో శిఖర్ ​ధవన్‌ (57, 33 బంతుల్లో 6×4, 6×2), శ్రేయాస్ ​అయ్యర్‌(53, 43 బంతుల్లో 4×3, 6×2) రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు. ఉనాద్కత్​ రెండు, త్యాగి, శ్రేయాస్‌ గోపాల్‌ ఒక్కో వికెట్ ​చొప్పున తీశారు.

లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్​కు దిగిన రాజస్తాన్ ​రాయల్స్ ఓపెనర్లు బెన్ ​స్టోక్స్​(41,35 బంతుల్లో 6×4), జేసీ బట్లర్​(22, 9 బంతుల్లో 3×4, 6×1) మంచి శుభారంభం అందించారు. ఎస్​వీ శాంసన్​(25,18 బంతుల్లో 6×2), ఉతప్ప (32, 27 బంతుల్లో 4×3, 6×1) తేవాతియా 14 పరుగులు చేశారు. మిగతా వారు ఎవరూ కూడా చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగుల వద్ద అలౌట్​అయ్యారు. ఇక ఢిల్లీ బౌలర్లలో దేశ్​పాండే, నార్త్​జే రెండు వికెట్ల చొప్పున, రబడ, అశ్విన్, పటేల్​ ఒక్కో వికెట్​చొప్పున తీశారు. ప్లేయర్​ఆఫ్​ది మ్యాచ్ అవార్డు అన్​రిచ్​నార్త్​జేకు దక్కింది. టాటా అల్ట్రోజ్ ​సూపర్ ​స్ట్రైకర్ ​ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు స్టార్ ​ఓపెనర్ ​శిఖర్​ ధవన్​కు దక్కింది.