Breaking News

వ్యాధుల సీజన్ లో జాగ్రత్తగా ఉండాలె

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ప్రగతి భవన్ మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్లు, మున్సిపల్​ చైర్మన్లు, అడిషనల్​ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో వ్యాధుల ప్రభావం, పట్టణ ప్రగతి, పబ్లిక్ మరుగుదొడ్లు, హరితహారం మొక్కల పెంపకం తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.