Breaking News

వ్యక్తిగత జాగ్రత్తలు ముఖ్యం

వ్యక్తిగత జాగ్రత్తలు ముఖ్యం

సారథి న్యూస్, కర్నూలు: నగరంలో కరోనా కట్టడి అహర్నిశలు ప్రతి కాలనీలో శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత జాగ్రత్తలు ఎంతో ముఖ్యమని కర్నూలు నగర పాలక కమిషనర్ డీకే బాలాజీ సూచించారు. మంగళవారం స్థానిక వెంకటరమణ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులకు కరోనా వైరస్ వ్యాప్తి నుంచి రక్షణ కోసం బెంగళూర్ నుంచి తెప్పించిన ఫేస్ షీల్డ్ మాస్క్ కు అందజేశారు. కార్మికులు, సిబ్బందికి 2,250 ఫేస్ షీల్డ్ మాస్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.