Breaking News

వైఎస్సార్ ​సీపీలోకి శిద్ధ రాఘవరావు

JAGAN

సారథి న్యూస్, అనంతపురం: ఏపీలోని టీడీపీకి భారీ షాక్​ తగిలింది. టీడీపీ సీనియర్​ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం వైఎస్సార్​సీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్​ మోహన్​రెడ్డి శిద్ధాతో పాటు ఆయన కుమారుడు సుధీర్​కుమార్​కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఉన్నారు. ఈ సందర్భంగా శిద్ధా మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు.