Breaking News

వెనక్కి తగ్గిన హీరో రామ్​

విజయవాడ రమేశ్​ హాస్పిటల్స్​ వ్యవహారంపై సంచలన ట్వీట్లు పెట్టిన రామ్​ పోతినేని వెనక్కి తగ్గాడు. ఇకమీదట తాను ఈ ఘటనపై ఎటువంటి ట్వీట్లు పెట్టబోనని మరో ట్వీట్​పెట్టాడు. న్యాయంపై తనకు నమ్మకుందని చెప్పుకొచ్చాడు. నిజమైన దోషులకు శిక్షపడుతుందని భావిస్తున్నా అని చెప్పాడు. రామ్​ ట్వీట్లు సంచలనంగా మారడంతో.. వైఎస్సార్​సీపీ సోషల్ ​మీడియా విభాగం ఓ రేంజ్​లో విరుచుకుపడింది. స్వర్ణప్యాలెస్​లో 10 మంది చనిపోతే స్పందించని రామ్​.. ఇప్పడు ఆయన బంధువు మీదకొచ్చేసరికి నీతులు బోధిస్తున్నాడంటూ ఫైర్​ అయ్యారు వైఎస్సార్​సీపీ నేతలు. మరోవైపు రామ్​ ట్వీట్లపై పోలీసులు కూడా స్పందించారు. కేసును ప్రభావితం చేస్తున్నందును ఈ హీరో రామ్​కు నోటీసులు అందిస్తామని విజయవాడ ఏసీపీ ఓ ప్రకటన విడుదల చేశారు. విచారణ జరుగుతున్న ఓ కేసుపై ట్వీట్లు పెట్టడం సరికాదని పరోక్షంగా హెచ్చరించారు. మరోవైపు నెటిజన్లు కూడా రామ్​ వ్యవహారశైలిపై మండిపడ్డారు. దీంతో రామ్ ​పోతినేని మనసు మార్చుకున్నాడు.