Breaking News

విపత్తులోనూ ప్రగతే లక్ష్యం

వినోద్​కుమార్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా విపత్తు పీడిస్తున్న ప్రస్తుత సమయంలోనూ ప్రగతి సాధించాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ పేర్కొన్నారు. పలు పరిశ్రమలు కరోనా సమయంలో తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయని చెప్పారు. లాభాలు సాధించేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇన్​‌స్టిట్యూట్​ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఇండియా) తెలంగాణా సెంటర్‌ ఆధ్వర్యంలో ‘ఖనిజ పరిశ్రమలపై కోవిడ్‌-19 ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన వెబ్‌నార్‌ లో ఆయన ప్రసంగించారు. ఖనిజ పరిశ్రమల ఇంజినీర్లు కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకొంటూ ఉత్పాదకత పెంచేందుకు కృషిచేయాలని సూచించారు. సదస్సులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌, సింగరేణి జీఎం (మార్కెటింగ్‌) రవిశంకర్‌, సింగరేణి కాలరీస్‌ అడ్వయిజర్‌ (మైనింగ్‌) డీఎన్​ప్రసాద్​, ఆస్ట్రేలియా, స్వీడన్‌ దేశాలకు చెందిన మైనింగ్‌ మేధావులు డాక్టర్​ లక్ష్మీ చికటమర్ల, దిపేశ్​ దిపు, బిద్యుత్‌ చక్రవర్తి, పీ శరత్‌ కుమార్‌ పాల్గొన్నారు.