Breaking News

వాళ్లిద్దరి సినిమాల్లో చేయాలని ఉంది

వాళ్లిద్దరి సినిమాల్లో చేయాలని ఉంది..

‘ఆర్ఎక్స్100’ సినిమాతో టాలీవుడ్​ కు పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్​గ్లామరే ప్రధానంగా నటిస్తూ ఉన్న పాయల్ హఠాత్తుగా కంటెట్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తానంటోంది. అయితే రీసెంట్​గా పాయల్ రెండు భారీ చిత్రాల్లో ప్రత్యేక గీతాలు చేయనుందనే వార్త వైరల్ అయితే ఆ సినిమాలు నేను చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ సమయంలో ప్రస్తుతం తను స్ర్కిప్టులు వినే పనిలో ఉన్నానని, నా క్యారెక్టర్​కు ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమా చేస్తానని.. గ్లామర్ కంటే కథకే ప్రాధాన్యం ఇస్తానని.. ఐటెం సాంగులు చేయనని కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. దాంతో పాటు తన మనసులోని మాట కూడా బయటపెట్టింది. తనకు ఇద్దరు హీరోలంటే క్రష్ అని. ఎప్పటికైనా వాళ్లిద్దరితో నటించాలని ఉందని కూడా బాహాటంగా తన ఇష్టాన్ని తెలిపింది. ఇంతకీ ఆ హీరోలు ఎవరనుకుంటున్నారా. ఒకరు బాహుబలి ప్రభాస్ అయితే, మరొకరు విజయ్ దేవరకొండ. ఈ వార్త ఆ హీరోలకు చేరిందో లేదో.. మరి పాయల్ కల ఎంతవరకూ నెరవేరనుందో చూడాలి.