అబుదాబి: అబుదాబి వేదికగా ఐపీఎల్13 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్(డీఐ)తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. కలకత్తా 195 పరుగుల టార్గెట్ను నిర్దేశించగా, ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకు ఢిల్లీ కుప్పకూలింది. ఐదు వికెట్లు తీసి కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఢిల్లీ ఓపెనర్లు అజింక్యా రహానే(0), శిఖర్ ధావన్(6) నిరాశపరిచారు. శ్రేయస్ అయ్యర్(47;38 బంతుల్లో 4×4), రిషభ్ పంత్(27; 33 బంతుల్లో 4×2 , 6×1) స్కోరు బోర్డును నడిపించినా ఎంతోసేపు క్రీజ్లో నిలవలేదు. ఏడుగురు ఢిల్లీ ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితమవడం గమనార్హం. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ ఐదు, కమిన్స్ మూడు వికెట్లు సాధించగా, ఫెర్గ్యూసన్కు ఒక వికెట్ తీశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. నితీష్ రాణా(81; 53 బంతుల్లో 4×13 ఫోర్లు, 6×1), నరైన్(64; 32 బంతుల్లో 4×6, 6×4) ధాటిగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జే, రబడా, మార్కస్ స్టోయినిస్ రెండు వికెట్ల చొప్పున తీశారు.
- October 24, 2020
- Archive
- Top News
- క్రీడలు
- DC
- DELHICAPITALS
- IPL13
- KKR
- KOLKATA
- ఐపీఎల్13
- కేకేఆర్
- కోల్కతా నైట్రైడర్స్
- డీసీ
- ఢిల్లీ క్యాపిటల్స్
- Comments Off on వరుణ్ దెబ్బకు ఢిల్లీ కుదేల్