Breaking News

వరుణ్‌ దెబ్బకు ఢిల్లీ కుదేల్​

వరుణ్‌ దెబ్బకు ఢిల్లీ కుదేల్​

అబుదాబి: అబుదాబి వేదికగా ఐపీఎల్​13 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌(డీఐ)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. కలకత్తా 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి దెబ్బకు ఢిల్లీ కుప్పకూలింది. ఐదు వికెట్లు తీసి కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఢిల్లీ ఓపెనర్లు అజింక్యా రహానే(0), శిఖర్‌ ధావన్‌(6) నిరాశపరిచారు. శ్రేయస్‌ అయ్యర్‌(47;38 బంతుల్లో 4×4), రిషభ్‌ పంత్‌(27; 33 బంతుల్లో 4×2 , 6×1‌) స్కోరు బోర్డును నడిపించినా ఎంతోసేపు క్రీజ్​లో నిలవలేదు. ఏడుగురు ఢిల్లీ ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవడం గమనార్హం. కేకేఆర్ బౌలర్లలో వరుణ్‌ ఐదు, కమిన్స్‌ మూడు వికెట్లు సాధించగా, ఫెర్గ్యూసన్‌కు ఒక వికెట్ ​తీశాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. నితీష్‌ రాణా(81; 53 బంతుల్లో 4×13 ఫోర్లు, 6×1‌), నరైన్‌(64; 32 బంతుల్లో 4×6, 6×4) ధాటిగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జే, రబడా, మార్కస్‌ స్టోయినిస్‌ రెండు వికెట్ల చొప్పున తీశారు.