Breaking News

‘వకీల్​ సాబ్’​తో శృతిహాసన్​ జోడి

‘వకీల్​ సాబ్’​తో శ్రుతిహాసన్​ జోడి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ కరోనాతో వాయిదాపడింది. ఈ సినిమాలో పవన్​తో జోడీ కట్టేందుకు ఇంకా ఎవరినీ అధికారికంగా నిర్ణయించలేదు. తమిళంలో అజిత్​తో వచ్చిన ‘నేర్కొండ పార్వై’ చిత్రంలో అజిత్ సరసన విద్యాబాలన్ నటించారు. అయితే పవన్ పక్కన శృతిహాసన్ ను సెలెక్ట్ చేశారన్న వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొట్టింది. అప్పుడా వార్తలను శృతిహాసన్ కొట్టి పారేసింది. ఇప్పుడేమో ఒక ఎంటర్​టైన్​మెంట్​ పోర్టల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చిత్రంలో ఓ కీలకపాత్ర చేస్తున్నానంటూ చెప్పింది. వివరాలు అడిగేసరికి మాట తిరగేస్తూ సైలెంట్ అయిపోయింది. లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్లుగా వ్యవరిస్తోంది. కాగా, శృతిహాసన్ ‘గబ్బర్ సింగ్, కాటమరాయుడు’ సినిమాల్లో పవన్​కు జోడీగా నటించింది. వకీల్​సాబ్ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నాడు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.