![రైతు వేదికలు అక్టోబర్ 15 నాటికి పూర్తికావాలె](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/jc-2.jpg?fit=677%2C291&ssl=1)
సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్మిస్తున్న 461 శ్మశాన వాటికలు,143 రైతు వేదికల నిర్మాణాలు అక్టోబర్ 15 నాటికి పూర్తికావాలని కలెక్టర్ఎల్.శర్మన్ ఆదేశించారు. సంబంధిత ఇంజనీరింగ్అధికారులతో ఆయన సమీక్షించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులకు ఇప్పటివరకు బిల్లులు మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో సర్పంచ్లు నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనుల్లో పురోగతి లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కంప్లీట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణ పనుల్లో ఇంజనీరింగ్ అధికారులు అలసత్వం చేస్తూ అధికారులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు.