Breaking News

రైతుల కోసం వేలకోట్లు

సారథి న్యూస్​, హుస్నాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్​కుమార్​ పేర్కొన్నారు. గురువారం హుస్నాబాద్, అక్కన్నపేట మండలం పందిల్ల, జనగాం గ్రామాల్లో రైతు వేదికలకు భూమి పూజ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి వేల కోట్లు వెచ్చిస్తున్నారన్నారు. దేశానికే వెన్నెముకయిన అన్నదాతల్లో నూతన వ్యవసాయ విధానాలు అమలు కావడానికి ఈ వేదికలు తొడ్పతయన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీపీలు మానన, లక్ష్మి, జడ్పీటీసీలు మంగ, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.