Breaking News

రియా చక్రవర్తి అరెస్ట్​

ముంబై: సుశాంత్​ రాజ్​పుత్​ మృతికేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని మంగళవారం ఎన్​సీబీ ( నార్కొటిక్​ కంట్రోల్ బ్యూర్) అరెస్ట్​ చేసింది. రియా అరెస్ట్​ అవుతారంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా డ్రగ్స్​ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్టు ఎన్ సీబీకి కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మూడురోజుల పాటు ఎన్​సీబీ రియాను విచారించింది. ఆమె సోదరుడు షోవిక్​ చక్రవర్తిని ఎన్​సీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. సుశాంత్​ ఆత్మహత్య కేసును విచారిస్తున్న సీబీఐకి డ్రగ్స్​ మాఫియా వ్యవహారం తెలిసింది. దీంతో రియా కేసును ఎన్​సీబీ అధికారులు దర్యాప్తు చేశారు. అయితే రియా మరో 25 మంది బాలీవుడ్​ ప్రముఖుల పేర్లు చెప్పినట్టు సమాచారం.