Breaking News

‘రియా’ కేసులో మీడియా అతి

సుశాంత్​ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిపై బాంబే హైకోర్టు సానుభూతి కనబర్చింది. ‘రియా కేసు విషయంలో మీడియా ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది. నిరంతరం బ్రేకింగ్​ న్యూస్​లతో ఆమెను ఎందుకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రియా ఇంటి ఎదుటే మీడియా టెంట్​ వేసుకొని కూర్చొంది. ఆమె కాలి బయట పెడితే .. చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మీడియా ప్రతినిధులు. రియా విషయంలో మీడియా చాలా అతిచేస్తుంది. నిందితురాలికి కొన్ని హక్కులుంటాయి. నేరం విచారణ జరగముందే ఆమెను దోషిగా నిలబెట్టడం తప్పు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు. కేంద్రం ఈ అంశంపై లిఖితపూర్వక సమాధానం చెప్పాలి’ అంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంపై కేంద్రప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.