Breaking News

రియాకు నో బెయిల్

సుశాంత్​ కేసులో అరెస్ట్​యిన రియా చక్రవర్తి పెట్టుకున్న బెయిల్​ పిటిషన్​ను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమెకు కొంతకాలం పాటు జైలు జీవితం తప్పేటట్లు లేదు. ​ రియా చక్రబొర్తి ఆశలు అడియాశలయ్యాయి. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె మరికొన్నాళ్లు జైలులోనే ఉండబోతోంది. ఈ నెల 22 వరకు రియా రిమాండ్​ ఖైదీగా ఉండబోతున్నది. మొదటి నుంచి అనేక మలుపులు తిరిగిన సుశాంత్​ ఆత్మహత్య కేసు అటుతిరిగి ఇటు తిరిగి రియా మెడకు చుట్టుకున్నది. సుశాంత్​ కేసులో డ్రగ్స్​కోణం వెలుగుచూడటంతో రియాకు చిక్కులు వచ్చి పడ్డాయి. డ్రగ్స్​ మాఫియాతో రియాకు సంబంధం ఉన్నట్టు ఎన్​సీబీ, సీబీఐ పలు కీలక ఆధారాలు సేకరించింది. అనంతరం ఎన్​సీబీ రియా చక్రవర్తిని అరెస్ట్​ చేసి మేజిస్ట్రేట్​ ఎదుట హాజరుపరిచింది. కోర్టు ఆమెకు ఈ నెల 22 వరకు రిమాండ్​ విధించింది. అయితే తాజాగా రియాచక్రవర్తి పెట్టుకున్న బెయిల్​ పిటిషన్​ను కోర్టు తిరస్కరించింది. రియాతోపాటు ఆమె సోదరుడు షోవిక్​, మిగిలిన ఏడుగురు నిందితులు పెట్టుకున్న బెయిల్​ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. అయితే రియా ఇప్పుడు ముంబయి హైకోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం. కాగా ఆమె బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తుందని ఎన్సీబీ వాదించింది.