Breaking News

రాష్ట్రంలో 1,269 పాజిటివ్ ​కేసులు

తెలంగాణలో కాస్త ఊరట

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొంచెం తగ్గినట్టే కనిపిస్తోంది. గత మూడు నాలుగు రోజులతో పోల్చితే ఆదివారం కేసులు తగ్గాయి. ఆదివారం తాజాగా 1,269 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. అయితే ఇప్పటి వరకు 356 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 1,70,324 మందిని పరీక్షించారు. మొత్తం పాజిటివ్​కేసుల సంఖ్య 34,671కు చేరింది. జీహెచ్​ఎంసీ పరిధిలో 800 కేసులు, రంగారెడ్డి జిల్లా 132, మేడ్చల్​ 94, సంగారెడ్డి 36, వరంగల్​ అర్బన్​12, కరీంనగర్​ 23, మెదక్​14, మహబూబ్​నగర్​17, నాగర్​కర్నూల్​23, నల్లగొండ జిల్లాలో 15 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను వెల్లడించింది.