Breaking News

రాశీఖన్నాతో మరోసారి..

రాశీ కన్నాతో మరోసారి

కొన్నేండ్లుగా సరైన హిట్​ పడకపోవడంతో రవితేజ డీలా పడిపోయాడు. మార్కెట్​ కూడా తగ్గిపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్​కొట్టాలని కసిగా ఉన్నాడు. ఈ క్రమంలో గోపిచంద్​ మలినేని డైరెక్షన్లో క్రాక్​ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతీహాసన్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. తమన్​ బాణీలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే.. రాక్షసుడు ఫేమ్​ రమేశ్​వర్మతో మరో సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించాడు రవితేజ. ఈ చిత్రంలో ఆయన డబల్ రోల్​ చేయనున్నట్టు టాక్​. ఇప్పటికే నిధి అగర్వాల్ హీరోయిన్​గా ఎంపికైంది. మరో నాయికగా రాశీ కన్నాను ఫైనల్​ చేసిందట చిత్ర యూనిట్​.