Breaking News

రామగుండం ఐటీ పరిశ్రమలకు అనువైన ప్రాంతం

రామగుండం ఐటీ పరిశ్రమలకు అనువైన ప్రాంతం

సారథి న్యూస్, రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశాల మేరకు ఐటీ సీఈవో(ప్రమోషన్స్) విజయ్ ​రంగనేనితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఐటీ పార్క్ వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.
మంత్రి నిరంజన్​రెడ్డిని కలిసిన కోరుకంటి
అంతకుముందు ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డిని కలిశారు. రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్​ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. రామగుండం నియోజవర్గంలో నూతనంగా నిర్మించిన రైతువేదికలతో పాటు పుట్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రారంభోత్సవం, కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని కోరారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్​ బండారి ప్రవీణ్ కుమార్, సతీష్​ ఉన్నారు.