Breaking News

‘రాధాకృష్ణా.. నీ బతుకంతా కుట్రలే’

తాడేపల్లి: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాధాకృష్ణ ఓ బ్రోకర్​ అంటూ వ్యాఖ్యానించారు. ‘రాధాకృష్ణ నువ్వు తల్లిపాలు తాగావా.. లేక నాగుపాము విషం తాగి పెరిగావా? నీ బతుకంతా కుట్రలు పన్నడమే. విషసర్పంలా ఏపీ సర్కార్​ వెంటపడ్డావు’ అంటూ ఫైర్​ అయ్యారు. ‘హనీ ట్రాప్‌.. ఇద్దరు కలెక్టర్ల కహానీ’ పేరుతో క‌లెక్ట‌ర్ల‌పై ‘ఆంధ్ర‌జ్యోతి’లో కథనం ప్రచురిత‌మైంది. ఈ కథనంపై జోగి రమేశ్​ స్పందించారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్​కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును సీఎం కుర్చీ ఎక్కించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ వైస్రాయ్​ హోటల్​లో హనీట్రాప్​ చేశాడని ఆరోపించారు. రాధాకృష్ణకు భయపడే వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. రాధాకృష్ణ ఎన్ని కుట్రలు చేసినా.. 25 ఏళ్ల పాటు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంటుందని చెప్పారు.