![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/JOGI-RAMESH-FF.jpg?fit=1000%2C600&ssl=1)
తాడేపల్లి: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాధాకృష్ణ ఓ బ్రోకర్ అంటూ వ్యాఖ్యానించారు. ‘రాధాకృష్ణ నువ్వు తల్లిపాలు తాగావా.. లేక నాగుపాము విషం తాగి పెరిగావా? నీ బతుకంతా కుట్రలు పన్నడమే. విషసర్పంలా ఏపీ సర్కార్ వెంటపడ్డావు’ అంటూ ఫైర్ అయ్యారు. ‘హనీ ట్రాప్.. ఇద్దరు కలెక్టర్ల కహానీ’ పేరుతో కలెక్టర్లపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై జోగి రమేశ్ స్పందించారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును సీఎం కుర్చీ ఎక్కించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ వైస్రాయ్ హోటల్లో హనీట్రాప్ చేశాడని ఆరోపించారు. రాధాకృష్ణకు భయపడే వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. రాధాకృష్ణ ఎన్ని కుట్రలు చేసినా.. 25 ఏళ్ల పాటు వైఎస్సార్సీపీ అధికారంలో ఉంటుందని చెప్పారు.