![తమిళనాడు రాజ్భవన్లో 84 మందికి కరోనా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/RAJBHAVAN-TAMILNADUFF.jpg?fit=985%2C610&ssl=1)
చెన్నై: తమిళనాడు గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్లో పనిచేస్తున్న 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 147 మందికి పరీక్షలు చేయగా 84 మందికి కరోనా సోకడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నది. వీరంతా రాజ్భవన్ పరిసరాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ 84 మందిలో ఏ ఒక్కరూ కూడా ఇటీవల గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ను కాంటాక్ట్ కాలేదని అక్కడి అధికారులు తెలిపారు.