Breaking News

రాఖీ కట్టేందుకు వెళ్తూ..

సారథిన్యూస్​, పెద్దపల్లి: ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా రాఖీ కడుదామనుకున్న ఓ సోదరి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఆ మహిళను బలితీసుకున్నది. సోదరుడి చేతుల్లోనే ఆ యువతి ప్రాణాలు విడిచింది. ఈ విషాధ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని రాజీవ్​ రహదారిపై శనివారం చోటుచేసుకున్నది. పెద్దపల్లి జిల్లాకు చెందని ఓ మహిళ రాఖీ పౌర్ణమి పండుగకోసం తన సోదరుడితో కలిసి గోదావరిఖనికి బైక్​పై వస్తుండగా.. రాజీవ్​ రహదారి వద్ద వారి వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ యువతి అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.