Breaking News

యమ బిజీ అయిపోయాడు

అన్నీ బాగుంటే ఈపాటికి పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిపోయి ఉండేవాడు నితిన్. కానీ ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో యమ బిజీ అయిపోయాడు. ప్రజంట్ నితిన్ చేతిలో నాలుగు సినిమాల వరకూ ఉన్నాయి. కీర్తి సురేష్, నితిన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ్దే’ మూవీ కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఆగస్టు నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారని సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చెప్పాడు.

చిత్రషూటింగ్ 70శాతం పూర్తయిందని, మిగిలిన 30శాతం ఆగస్టు నుంచి స్టార్టవుతుందట. ఆ తర్వాత ‘అంధాదూన్’ రీమేక్, ‘పవర్ పేట’ రీమేక్​తో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది నితిన్. ‘అంధాదూన్’లో దివ్యాంగుడిగా కనిపించనుండగా, ‘పవర్ పేట’రీమేక్​లో వరుసగా ఇరవై, నలభై, అరవై ఏళ్ల వ్యక్తిగా మూడు దశల్లో కనిపించనున్నాడట. ఈ మూడు దశల మేకప్ కోసం ఇంటర్​నేషనల్ మూవీస్​కు పనిచేసిన మేకప్ ఆర్టిస్ట్​ను రప్పించనున్నారట. మొత్తానికి నితిన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ట్రై చేస్తూ బాగా బిజీ అయిపోనున్నాడన్నమాట.