Breaking News

మొత్తం కేసులు @ 24 లక్షలు

కరోనా కొత్తకేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 24,61,190 కు చేరుకున్నది. గత 24 గంటల్లోనే 64,553 కొత్తకేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 48,040 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 17,51,555 మంది కరోనానుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 6,61,595 మంది వివిధ దవాఖానల్లో చికిత్సపొందుతున్నారు.