![మొక్క నాటి ఎమ్మెల్సీకి విషెస్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/nzpt-3F.jpg?fit=918%2C670&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి జన్మదిన సందర్భంగా సోమవారం నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు పంజా విజయ్ కుమార్ తన నివాసంలో మొక్కనాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ మొక్కను నాటి శుభాకాంక్షలు తెలపాలని పిలుపు ఇవ్వడంతో మొక్కలను నాటినట్లు తెలిపారు.