Breaking News

ములుగు.. జలసంద్రం

ములుగు.. జలసంద్రం

  • మేడివాగులో ఇద్దరు మత్స్యకారుల గల్లంతు
  • హైవేపైకి చేరిన రామప్ప సరస్సు నీరు

సారథి న్యూస్​, ములుగు: ములుగు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో జిల్లా జలసంద్రంగా మారింది. జిల్లాలోని జంగాలపల్లి గ్రామం వద్ద హైవేపైకి రామప్ప సరస్సు నీరు చేరుకోవడంతో ములుగు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి ములుగులోనే నిలిపివేస్తున్నారు.
ఇద్దరు గల్లంతు
జంగాలపల్లి వద్ద నేషనల్​ హైవేపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఉదయం 7 గంటల ప్రాంతంలో బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. బండారుపల్లికి చెందిన ఇద్దరు మత్స్యకారులు అల్లం శివాజీ, కవిరాజుగా గుర్తించారు. మేడివాగు వద్ద బైక్ పై వెళ్తుండగా అక్కడ ఆగిన క్రమంలో అదుపుతప్పి వాగులో పడిపోయినట్లు తెలిసింది. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.