Breaking News

మీడియాపై శ్రద్ధాదాస్​ ఫైర్​

మీడియాపై శ్రద్ధ ఫైర్​

తనపై తప్పుడు వార్తలు రాస్తే కేసు పెడతానంటూ శ్రద్ధాదాస్ మీడియాను​ హెచ్చరించారు. శ్రద్ధాదాస్​ బిగ్​బాస్​ సీజన్​ 4లో పాల్గొనబోతుందంటూ ఇటీవల ఓ వార్త సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది. పలు తెలుగు వెబ్​సైట్లలోనూ ఈ వార్తను ప్రచురించారు. దీంతో శ్రద్ధాదాస్​ ఫైర్​ అయ్యారు. ‘బిగ్​బాస్​ నిర్వాహకులు ఎవరూ తనను సంప్రదించలేదు. నేను కూడా బిగ్​బాస్​లో చేరతానని ఎప్పడూ ప్రకటించలేదు. అయినా ఇటువంటి తప్పడు వార్తలు ఎందుకు ప్రచురించారు’ అంటూ ఆమె ఫైర్​ అయ్యారు. మరోసారి తనపై తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కాగా శ్రద్ధాదాస్​ తీరుపై నెట్​జన్లు మండిపడుతున్నారు. ఇంత చిన్న విషయానికే అంత సీరియస్​ కావాలా? సింపుల్​గా నేను బిగ్​బాస్​లో పాల్గొనడం లేదు అంటూ ప్రకటిస్తే సరిపోతుంది కదా! అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమయినా శ్రద్ధ కోపానికి కారణం మరొకటి ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.