Breaking News

మీడియాపై రకుల్​ ఫైర్​ ఎందుకంటే..

అందాల భామ రకుల్​ ప్రీత్​సింగ్​ మరోసారి మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజానిజాలు తెలుసుకొని వార్తలు రాయాలంటూ ఫైర్​ అయ్యారు. ఇంతకు ఈ భామకు కొపం తెప్పించిన ఈ వార్త ఎంటో తెలుసా.. రకుల్​ శివకార్తికేయన్‌ సరసన తమిళంలో ‘అయలాన్‌’ అనే సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే లాక్​డౌన్​తో షూటింగ్​ ఆగిపోయింది. ఇటీవల ప్రభుత్వాలు షూటింగ్​ కు అనుమతి ఇవ్వడంతో తిరిగి చిత్రీకరణ ప్రారంభించాలనుకున్నారు చిత్ర నిర్మాత. కానీ కరోనా తగ్గే వరకు తాను షూటింగ్​లో పాల్గొనని రకుల్​ ప్రీత్​మొండికేస్తున్నదంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో రకుల్​ మీడియాపై చిర్రుబుర్రలాడారు. ‘షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తారా అని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు​. తనపై తప్పడు వార్తలు రాయడం సరికాదన్నారు. కాగా ఈ వార్తలకు ‘అయలాన్‌’ చిత్రదర్శకుడు రవికుమార్‌ స్పందిస్తూ ‘రకుల్‌ ప్రొఫెషనల్‌ ఆర్టిస్ట్‌. ఆమె గురించి వదంతులు రావడం దురదృష్టకరం’ అన్నారు. ఇంకా చిత్రనిర్మాత ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం.