Breaking News

మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి

మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మెదక్​ జిల్లాకు చెందిన మాజీమంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని సీఎం కె.చంద్రశేఖర్​రావు నియమించారు. అలాగే సభ్యులుగా షాహినా అఫ్రోజ్, కుమ్మర ఈశ్వర్ భాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుద్దం లక్ష్మి, కఠారి రేవతిరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ ఉత్తర్వులు జారీచేశారు. వీరంతా ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.