Breaking News

మహనీయుడిని మరిచిన నేతలు

మహనీయుడిని మరిచిన నేతలు

సారథిన్యూస్, రామడుగు: తమకు ఇష్టమైన రాజకీయ నాయకుల పుట్టినరోజులకు పోటీపడి ఉత్సవాలు చేసే నాయకులు.. మహనీయుడైన అబ్దుల్​ కలాం వర్ధంతిని మరిచారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పలుచోట్ల కలాంకు వివిధ పార్టీల నాయకులు నివాళి అర్పించారు. కానీ కరీంనగర్​ జిల్లా రామడుగులో మాత్రం నేతలు కలాంను మరిచిపోయారు. ఒక పువ్వు పెట్టి నివాళి అర్పించే సమయం కూడా వారికి లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులను ప్రసన్నం చేసుకోవడం తగ్గించి.. దేశానికి సేవచేసిన మహనీయులను గుర్తించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.