![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/JOURNALISTS-FF.jpg?fit=827%2C679&ssl=1)
సారథిన్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారికి ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు, హోంక్వారైంటైన్లో మరో ఐదుగురికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఇప్పటి వరకు 99 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రాగా ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున 19 లక్షల 80 వేలు రూపాయలు ఆర్థికసాయం అందించామని చెప్పారు. హోంక్వారంటైన్లో ఉన్న 52 మందికి 10 వేల రూపాయల చొప్పున 5 లక్షల 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధ్రువీకరించిన మెడికల్ రిపోర్టులు అకాడమీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ నెంబర్ కి పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్ సెల్ నెంబర్ 9676647807 ని సంప్రదించవచ్చని తెలిపారు.