Breaking News

మరోసారి.. ఎయిమ్స్​లో చేరిన అమిత్​ షా

ఢిల్లీ: ఇటీవలే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్రహోం మంత్రి అమిత్​ షా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఎయిమ్స్​కు తరలించారు. ఆగస్టు 2న అమిత్​ షాకు కరోనా పాటిజివ్​ గా నిర్ధారణ అయ్యింది. గురుగ్రామ్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందిన ఆయన 14న డిశ్చార్జి అయ్యారు. అయితే ఆగస్టు 18న అయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎయిమ్స్​లో చేరారు. అనంతరం 30న ఆయన డిశ్చార్జి అయ్యారు. కాగా ఆయనకు ప్రస్తుతం మరోసారి తీవ్రశ్వాససంబంధిత ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమిత్​షా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ముందుజాగ్రత్త కోసం పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎయిమ్స్​ వైద్యులు తెలిపారు.