Breaking News

మన్యంకొండలో వైభవంగా తిరుచ్చిసేవ

మన్నెంకొండలో వైభవంగా తిరుచ్చిసేవ

సారథి న్యూస్,​ దేవరకద్ర: మహబూబ్​నగర్ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి తిరుచ్చిసేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయపాలకవర్గం వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా భక్తులు హాజరుకాలేదు. వేదపండితులు, పురోహితుల ఆధ్వర్యంలోనే ఈ ఘట్టం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్​ నిత్యానందచారి, ప్రధాన పూజారులు రాజేష్, నర్సింహయ్య పాల్గొన్నారు.