Breaking News

మద్యం ప్రియులకు గుడ్​న్యూస్​

మద్యం ప్రియులకు గుడ్​న్యూస్​

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో రాత్రి 9 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా, మరో గంట సమయాన్ని పెంచింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రోజు వారీ వివరాలు నమోదు చేసేందుకు ఎక్కువ నగదు లెక్కింపు సమయం సరిపోవడం లేదని.. అందుకే గంట సమయం పెంచుతున్నట్లు సర్కారు తేలిపింది. ఏదేమైనా మద్యం ప్రియులకు మాత్రం ఈ గంట సమయం పెంచడం మంచి తీపికబురే.