Breaking News

భారీగా పెరిగిన సైబర్‌‌ ఎటాక్స్‌

న్యూఢిల్లీ: గడిచిన రెండు నెలల్లో 200 శాతం సైబర్‌‌ ఎటాక్స్‌ పెరిగాయని పీఎంవో అధికారి గుల్షన్‌ రాయ్‌ పేర్కొన్నారు. అయితే చైనా –ఇండియా మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అవి పెరిగాయనే దానికి సాక్ష్యాలు లేవని ఆయన అన్నారు. ‘పిషింగ్‌, రాన్సమ్‌వేర్‌‌ ఎక్కువయ్యాయి. జనవరి, ఫిబ్రవరి చివన నుంచి ఈ కేసులు ఎక్కువయ్యాయి. టెన్షన్‌ పరిస్థితులు దృష్ట్యా పెరగలేదు’ అని ఆయన చెప్పారు. ఆఫీసులు అన్నీ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, పర్సనల్‌ కంప్యూటర్స్‌లో కూడా అప్లికేషన్లు డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకటికి రెండు సార్లు అప్లికేషన్‌ వెరిఫికేషన్‌ చేసుకోవాలని సూచించారు. రెండు నెలలుగా హ్యాకింగ్‌ బాగా పెరిగింది, దాదాపు అది 200 శాతం కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అని అన్నారు. ఈ అంశంపై మానిటరింగ్‌ చేస్తున్నామని అన్నారు. బ్యాంక్‌లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. పూర్తిగా ఆత్మనిర్భాన్‌ భారత్‌లోకి మారాలంటే కచ్చితంగా మరో రెండేండ్లు పడుతుందని చెప్పారు.