Breaking News

భారీగా గుట్కా ప్యాకెట్లు సీజ్​

చేవెళ్లలో గుట్కా సీజ్​

సారథిన్యూస్​, చేవెళ్ల: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను టాస్క్​ఫోర్స్​ పోలీసులు సీజ్​ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్​స్టేషన్​ పరిధిలోని బీబీగూడెం వద్ద టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేపట్టగా సుమారు రూ. 2 లక్షల 45 వేల విలువైన గుట్కాప్యాకెట్లు పట్టుబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు గుట్కా ప్యాకెట్లను హైదరాబాద్​ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీబీగూడెనికి తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్​ చేసినట్టు పోలీసులు తెలిపారు.