Breaking News

భారత భూభాగంలోకి పాక్​ డ్రోన్​

శ్రీనగర్​: భారత భూభాగంలోకి పాకిస్థాన్​ గూఢచార సంస్థకు చెందిన ఓ డ్రోన్​ రావడంతో బీఎస్​ఎఫ్​ పెట్రోలింగ్​ పార్టీ దీన్ని కూల్చివేసింది. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా.. హిరానగర్, సెక్టార్‌లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలను సరిహద్దు భద్రతా దళం గమనించింది. వెంటనే అప్రమత్తమైన 19 బెటాలియన్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ దీన్ని కూల్చి వేసింది. ఎనిమిది రౌండ్లు కాల్పుల అనంతరం ఆ డ్రోన్ ను విజయంతంగా నేలమట్టం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది.