![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/sunder-pichaiff.jpg?fit=268%2C188&ssl=1)
న్యూఢిల్లీ: భారత్లో గుగూల్ సంస్థ రూ. 75,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నదని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇండియాలో డిజిటల్ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు రానున్న ఐదేండ్లలో ఈ పెట్టుబడి పెడతున్నామని చెప్పారు. డిజిటల్ ఇండియా కోసం ప్రధాని మోదీ ఎంతో కృషిచేస్తున్నారని చెప్పారు. మోదీ ప్రయత్నాలకు మద్దతివ్వడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.