Breaking News

బి.గోపాల్​ డైరెక్షన్​లో మరోసారి..

బి.గోపాల్​ డైరెక్షన్​లో మరోసారి..

ప్రస్తుతం బాలకృష్ణ ‘లెజెండ్, సింహా’వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో మూడో సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్​ గా బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజై సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. అయితే బాలకృష్ణ ఈ సినిమా తర్వాత నెక్ట్స్ మూవీ దర్శకుడు బి.గోపాల్​తో చేయాలి అనుకుంటున్నాడట. బాలయ్యకు మొదటిసారి మాస్ ఇమేజ్ తెచ్చిన దర్శకుడు బి.గోపాల్. వారిద్దరి కాంబినేషన్​లో ‘లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు’ వంటి బంపర్ హిట్స్ ఉన్నాయి. అందుకే మళ్లీ ఈసారి బి.గోపాల్ సినిమా చేయాలని నిశ్చయించుకున్నాడట బాలయ్య. ఈ కాంబినేషన్​ కోసం రైటర్ సాయిమాధవ్ బుర్రా స్ట్రిప్ట్ రెడీ చేస్తున్నాడని టాక్. ఈ సినిమాలో బాలకృష్ణ రైతుగా కనిపించనున్నాడట. వీరి కాంబినేషన్ అంటేనే బాలయ్య అభిమానులు భారీ అంచనాలు వేసేసుకుంటారు. ఆ అంచనాలకు తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారట బి.గోపాల్.