![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/BITTIRI-SATTI-TELANGANA-CARONAGFF-1.jpg?fit=700%2C269&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: బిత్తిరిసత్తి అలియాస్ చేవెళ్ల రవికి కరోనా సోకినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కొంతకాలం క్రితం టీవీ9 నుంచి బయటకొచ్చిన బిత్తిరిసత్తి.. ఇటీవలే సాక్షి చానల్లో చేరిన విషయం తెలిసిందే. సాక్షిలో బిత్తిరిసత్తి.. ‘గరం గరం వార్తలు ’ అనే శీర్షికన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం అత్యంత జనాధరణ పొందింది. కాగా సత్తితో పాటు అతడి టీం మెంబర్స్ అంతా హోంఐసోలేషన్లో ఉండిపోయారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగిస్తారా? లేక కొంతకాలం వాయిదా వేస్తారా? వేచి చూడాలి.