Breaking News

బిత్తిరి సత్తికి కరోనా

సారథి న్యూస్​, హైదరాబాద్​: బిత్తిరిసత్తి అలియాస్​ చేవెళ్ల రవికి కరోనా సోకినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన హోం​క్వారంటైన్​లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కొంతకాలం క్రితం టీవీ9 నుంచి బయటకొచ్చిన బిత్తిరిసత్తి.. ఇటీవలే సాక్షి చానల్​లో చేరిన విషయం తెలిసిందే. సాక్షిలో బిత్తిరిసత్తి.. ‘గరం గరం వార్తలు ’ అనే శీర్షికన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం అత్యంత జనాధరణ పొందింది. కాగా సత్తితో పాటు అతడి టీం మెంబర్స్​ అంతా హోంఐసోలేషన్​లో ఉండిపోయారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగిస్తారా? లేక కొంతకాలం వాయిదా వేస్తారా? వేచి చూడాలి.