![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/KUMAR-SANUFF.jpg?fit=715%2C402&ssl=1)
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై దేశవ్యాప్తంగా నిరసన గళాలు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ సింగర్ కుమార్సాను మాట్లాడుతూ.. బాలీవుడ్లో విపరీతమైన బంధుప్రీతి ఉన్న మాట వాస్తవమేనని పేర్కన్నారు. అగ్రనటులు, నిర్మాతలు తమ బంధువులనే ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సొంత ట్యాలెంట్ ఉన్నవాళ్లు చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. కానీ స్వల్ప వ్యవధిలోనే బాలీవుడ్లో ఉన్నతస్థానానికి ఎదిగిన సుశాంత్ ఆత్మహత్య తనను ఎంతో కలిచివేసిందని చెప్పుకొచ్చారు. దేవుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు. బాలీవుడ్కు బీహార్ నుంచి శత్రుఘ్న సిన్హా, మనోజ్బాజ్పేయి, శేఖర్ సుమన్, ఉదిత్ నారాయణ్ వంటి ప్రతిభావంతులు వచ్చారని చెప్పారు. కుమార్ సాను తెలుగులో హీరో వెంకటేష్ నటించిన మల్లీశ్వరి తదితర చిత్రాలలో పాటలు పాడారు.