![బాధితకుటుంబాన్ని పరామర్శిస్తున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/SANJAY.jpg?fit=736%2C588&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలోపడి చనిపోగా, ఆదివారం అతని కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, తిర్మలపూర్ ఎంపీటీసీ మోదీ రవి, బీజేపీ సీనియర్ నాయకులు ఒంటెల కర్ణాకర్, మేకల ప్రభాకర్ యాదవ్, ఉప్పు రాంకిషన్ జిన్నారం విద్యా సాగర్, పొన్నం శ్రీను ఉన్నారు.