Breaking News

బాధితకుటుంబాలకు ఓదార్పు

బాధిత కుటుంబాలను ఓదార్చుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

సారథిన్యూస్​, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ సీఎం కేసీఆర్​ రూ. 2 లక్షల పరిహారం అందించారు. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితకుటుంబాలకు రూ.20 వేలు తక్షణసాయం ప్రకటించారు. జిల్లా పరిషత్​ చైర్మన్​ లింగాల కమల్​రాజ్​, మంత్రి పువ్వాడ అజయ్​ బాధితకుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడి ఖమ్మం ప్రభుత్వదవాఖానలో చికిత్సపొందుతున్న వారిని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు టీఆర్​ఎస్​ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయ ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ, నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, మందపాటి వెంకటేశ్వరరావు తదితరులు పరామర్శించారు.