Breaking News

బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్​

బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్​

సారథిన్యూస్​, గోదావరిఖని: డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ బడుగు, బలహీనవర్గాల అశాజ్యోతి అని దళితసంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అంబేద్కర్​ విగ్రహం వద్ద రిజర్వేషన్​ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ సభ్యుడు వడ్డెపల్లి శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు.. అంబేద్కర్ విగ్రహానికి, చత్రపతి సాహుమహరాజ్​, మహాత్మా జ్యోతిరావుపూలే చిత్రపటాలకు పూలమాలలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్​ కృషి వల్లే దళితులు రిజర్వేషన్లు పొందుతున్నారని, ఆత్మగౌరవంతో బతుకుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో దళితసంఘాల నేతలు ములుగు రాజు, మంతెన లింగయ్య పోగుల రంగయ్య, రాజలింగం, రవికుమార్, లచ్చులు, హనుమంతు, పంజా అశోక్, గంటయ్య, నారాయణ. అంకుష్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.