![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/VAGU-VAGUFF.jpg?fit=729%2C321&ssl=1)
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్పల్లి చెక్డ్యాం అలుగు పారుతోంది. బండర్పల్లి వంతెనను గతేడాది మంత్రి టి.హరీశ్రావు చొరవతో చెక్డ్యాంగా నిర్మించారు. కాగా, కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పెద్దఎత్తున నీరు చేరి అలుగు పారుతోంది. చెక్ డ్యాం నిండడంతో పరిసర గ్రామల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్డ్యాంకు నిధులు మంజూరు చేసిన మంత్రి టి.హరీశ్రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.