Breaking News

ఫిష్ హబ్ గా.. తెలంగాణ

ఫిష్ హబ్ గా.. తెలంగాణ

సారథి న్యూస్, జగిత్యాల: జగిత్యాల జిల్లా లింగంపేట చెరువులో 1.08లక్షల చేపపిల్లలను సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ ఆలోచన విధానంతో తెలంగాణ ఫిష్ హబ్ గా మారుతుందన్నారు. రిజర్వాయర్లు, చెరువుల్లో పుష్కలంగా చేపలు ఉన్నాయని అన్నారు. 2020- 21 సంవత్సరానికి జగిత్యాల జిల్లా సమీకృతం మత్స్య అభివృద్ధి పథకం కింద 18 మండలాల్లో 1.46 కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో 81 కోట్ల చేపపిల్లలు, ఐదుకోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల జడ్పీ చైర్మన్ దావ వసంత, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్​, మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.