![ప్లాస్మా దానం చేయండి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/carona-mdk-2F.jpg?fit=677%2C380&ssl=1)
సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ను మంత్రి టి.హరీశ్రావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట మున్సిపల్ ఆఫీసు ఆవరణలో కరోనా మొబైల్ టెస్టింగ్ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనాను జయించినవారు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.